కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సుప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం కోనేటి వద్ద అపశృతి చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సుప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం కోనేటి వద్ద అపశృతి చోటుచేసుకుంది. ఓ యువకుడు కోనేటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి చెందిన చిరంజీవి (20) మరికొందరు స్నేహితులతో కలసి ఆదివారం అహోబిలం క్షేత్రానికి వచ్చాడు. ఈత సరిగా రాకపోయిన కోనేటిలో దిగడంతో... నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు.