రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

Two Deceased In Bike Collision At Komuravelli In Siddipet District - Sakshi

సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మండలం దానంపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు పరస్పరం ఢీ కొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను దానంపల్లి గ్రామానికి చెందిన బండి శేఖర్, చిట్యాల గ్రామానికి చెందిన గొర్లకాడి స్వామిగా గుర్తించారు. స్వామితోపాటు బైక్‌ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top