తల్లిని హతమార్చి.. తలను పట్టుకెళ్లి.. 

Son Brutally Murdered His Mother in chennai - Sakshi

పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన తనయుడు 

టీ.నగర్‌ (చెన్నై): ఆస్తి కోసం కన్న తల్లిని హతమార్చాడో ప్రబుద్ధుడు. తల్లి తలను తెగనరికి తలతో పాటు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ అమానవీయ ఘటన తమిళనాడు పుదుక్కోట్టై జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కరంబకుడి సమీపాన మరవంబట్టి గ్రామానికి చెందిన తంగరాజ్‌ ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. అతనికి భార్య తిలగరాణి(48), ఐదుగురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఆనంద్‌(23) ఆస్తి పంచివ్వాలంటూ తల్లితో తరచూ తగాదాకు దిగేవాడు. 

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం రాణికి, ఆనంద్‌కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో ఆనంద్‌ కత్తితో తల్లి రాణి తల తెగనరికాడు. తల్లి తలను బైక్‌లో పట్టుకెళ్లి కరంబకుడి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top