ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం | Road Accident Three Persons Died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Apr 13 2018 11:41 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident Three Persons Died  - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు (ఇన్‌సెట్‌లో)  మృతి చెందిన నవీన్, హర్షిత్‌

పెద్దపంజాణి : మండలంలోని బట్టందొడ్డి సమీపంలో పలమనేరు–పుంగనూరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ చంద్రమోహన్‌ కథనం మేరకు.. పుంగనూరు పట్టణానికి చెందిన నరసింహులు భార్య అనిత, కుమారుడు నవీన్‌(26), కూతురు కొడుకు హర్షిత్‌(10), స్నేహితుడు దొరస్వామి(61) కలిసి కారులో సొంత పనుల నిమిత్తం చిత్తూరు వెళ్లారు.

పని ముగించుకుని స్వగ్రామం బయలుదేరారు. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న చిత్తూరు ఒకటో డిపోకు చెందిన మెట్రో బస్సు ఢీకొంది. దీంతో నవీన్, హర్షిత్‌ అక్కడిక్కడే మృతి చెందారు. దొరస్వామి, అనితకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. అక్కడ దొరస్వామి మృతిచెందాడు. ఎస్‌ఐ చంద్రమోహన్‌ అక్కడికి చేరుకుని మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement