మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు | Phsyco Killer Arrested in Woman Murder Case | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు

Dec 18 2019 4:35 PM | Updated on Dec 18 2019 4:43 PM

Phsyco Killer Arrested in Woman Murder Case - Sakshi

సాక్షి, మెదక్‌:  మహిళను హత్య చేసి.. తగలబెట్టిన ఓ సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట్‌ మండలంలో కొద్దిరోజుల క్రితం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సైకో కిల్లర్‌ నీరటి అరుణ్‌ను రామాయంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్ తిరుమలగిరి, ఆర్మూర్ ప్రాంతాల్లో పలు హత్య కేసులు ఉన్నాయి. నిజాంబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌పై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement