ఖైరతాబాద్‌లో కారు బీభత్సం | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 7:58 AM

Car Hit Divider At Khairatabad 2 People Injured Severely - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్‌ సిగ్నల్స్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ ఎక్కుతుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ని బలంగా ఢీకొట్టి అవతలివైపు పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తు‍న్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటువైపుగా వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement