పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వంట్లమామిడి సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
మోదకొండమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మాడుగుల మండల గుర్రాలపాలెం గ్రామానికి చెందిన దివి చలపతిరావు (50) , సూరిశెట్టి అప్పారావు (55)లు మృతి చెందారు. గాయపడిన వారిని అనకాపల్లి విశాఖ కేజీహెచ్ హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు.. బ్రేకు పెయిల్ అయి ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.


