శుభకార్యానికి వెళ్లి వస్తూ..

BJP Media Convener Died in Road Accident - Sakshi

ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌నుఢీ కొట్టిన కారు ఇద్దరి దుర్మరణం

మృతులు కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ మీడియా కన్వీనర్‌

నరేందర్, అతడి భార్య మరో ఇద్దరికి తీవ్రగాయాలు...

శామీర్‌పేట్‌: ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన బి.నరేందర్‌(46), అతని భార్య  నాగరాణి(42), కుమారుడు వినయ్, దీపికతో కలిసి ఇన్నోవా కారులో చౌటుప్పల్‌లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా శామీర్‌పేట ఓర్‌ఆర్‌ఆర్‌పై బ్రిడ్జీపై కారు డివైడర్‌ను వేగంగా ఢీకొనడంతో  కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ఓఆర్‌ఆర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా నరేందర్, నాగమణి మృతిచెందారు. వారి కుమారుడు వినయ్, కుమార్తె దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శామీర్‌పేట పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top