భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల | heay rush in tirumala | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

Jan 15 2018 7:56 AM | Updated on Jun 2 2018 2:59 PM

సాక్షి, తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్‌లో భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్ల వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

ఆదివారం శ్రీవారిని 87,336 మంది భక్తులు దర్శించుకోగా, 37,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement