జగన్‌ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యం | YS Jagan Give Good Development To People | Sakshi
Sakshi News home page

జగన్‌ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యం

Apr 8 2019 11:28 AM | Updated on Apr 8 2019 11:32 AM

YS Jagan Give Good Development To People - Sakshi

స్థానికులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి 

మర్రిపాడు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఏపిలగుంట గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేసి యువనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆయన సహకారంతో ఈ ప్రాంతాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అభివృద్ధి పరుస్తారని పేర్కొన్నారు.

ప్రధానంగా తాగు, సాగునీరు సమస్య లేకుండా చూస్తారన్నారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పనులకు కూడా దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. నేటి పాలకుల హయాంలో పనులు పూర్తి కాకపోవడం దారుణమన్నారు. ఈ పనులన్నీ పూర్తయి ఈ ప్రాంతానికి సాగునీరు అంది బీడు భూములన్ని బాగు చేసుకోవాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు.  అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు నాయుడు హజరత్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు రసం రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, సిద్దంరెడ్డి మోహన్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement