టిప్పర్ ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన వైఎస్సార్జిల్లా ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లె గ్రామంలో సోమవారం జరిగింది.
టిప్పర్ ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన వైఎస్సార్జిల్లా ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లె గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తుమ్మకుంట గ్రామానికి చెందిన నాగమణెమ్మ(45) గోవిందంపల్లె లోని మైక్రో కల్వైటింగ్ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు పనికి చేసుకుంటుండగా.. మిల్లుకు చెందిన ఓ టిప్పర్ అన్లోడ్ చేసి వెనక్కి వస్తూ.. ఆమెను ఢీకొట్టింది. దీంతో నాగమణెమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.