నగదు రహిత చెల్లింపులపై రేపు నివేదిక: సీఎం | Tomorrow a report on non-cash payments: CM | Sakshi
Sakshi News home page

నగదు రహిత చెల్లింపులపై రేపు నివేదిక: సీఎం

Jan 23 2017 1:32 AM | Updated on Aug 15 2018 2:30 PM

నగదు రహిత చెల్లింపులపై రేపు నివేదిక: సీఎం - Sakshi

నగదు రహిత చెల్లింపులపై రేపు నివేదిక: సీఎం

నగదు రహిత చెల్లింపులపై ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

సాక్షి, అమరావతి: నగదు రహిత చెల్లింపులపై ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆర్థికశాఖ ఉన్నతాధికారు లు, బ్యాంకర్లతో సమావేశమై నివేదికపై ఆయన చర్చించారు. సీఎంల కమిటీ ఈ నివేదికను మంగళవారం ప్రధానికి ఇవ్వనుందని తెలిపి సోమవారం మధ్యాహ్నంలోగా డిజిటల్‌ లావాదేవీలపై నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లను సీఎం కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 41 శాతం డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో దీన్ని 60 శాతానికి తీసుకెళ్లాలని చెప్పారు.

విజయవాడ చేరుకున్న చంద్రబాబు
ఇదిలా ఉండగా దావోస్‌ పర్యటన ముగించుకుని శనివారం అర్ధరాత్రి సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. డిజిటల్‌ లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చేందుకుగాను సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement