ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Sat, Mar 14 2020 7:09 PM

Today Telugu News Mar 14 President Trump declares emergency - Sakshi

కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్‌-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, దేశంలో చాపకిందనీరులా కోవిడ్‌-19 విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ చెప్పారు. ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Advertisement
Advertisement