'జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఏపీ నిర్మిస్తా' | Smart Andhra Pradesh construct says chandrababu naidu | Sakshi
Sakshi News home page

'జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఏపీ నిర్మిస్తా'

Mar 5 2015 4:54 PM | Updated on Aug 18 2018 5:48 PM

'జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఏపీ నిర్మిస్తా' - Sakshi

'జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఏపీ నిర్మిస్తా'

ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు పుష్కలంగా దొరుకుతాయని, పదిలక్షల ఎకరాల భూమిని సమీకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు పుష్కలంగా దొరుకుతాయని, పదిలక్షల ఎకరాల భూమిని సమీకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు గురువారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.  అన్ని పరిశ్రమలకు కావాల్సిన భూ అవసరాలను తమ ప్రభుత్వం తీరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. జపాన్ లో పర్యటించి.. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తానన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement