కాంగ్రెస్, టీడీపీలపై శోభా నాగిరెడ్డి ధ్వజం
రఘురామ కృష్ణంరాజు ఓ కోవర్టు..
ఎమ్మెల్యే బాలరాజు, ప్రసాదరాజు
వేముల, వేంపల్లె, న్యూస్లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీలు మీడియాను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇడుపులపాయలో పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 50 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగితే సగం నియోజకవర్గాలలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఆమె విమర్శించారు. జగన్ రమ్మని పిలిస్తే కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అవుతాయన్నారు. పార్టీలో కొంతమంది ఉన్నన్ని రోజులు పొగడటం.. వెళ్లిన తర్వాత విమర్శించడం మంచిది కాదన్నారు. ఎస్పీవై రెడ్డి సీఎంను కలిశారని విలేకరులు అడగగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సీఎంను కలుస్తున్నారని.. ఆయనను సీఎంగా కలుస్తున్నారు తప్ప.. కాంగ్రెస్ నాయకులుగా కలవలేదని, మీడియాయే తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
ఆ మూడు పార్టీల కోవర్టు...
బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోవర్టుగా ఉండటంవల్లే రఘురామ కృష్ణంరాజును వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించారని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు పేర్కొన్నారు. పార్టీలో ఉంటూ.. వ్యక్తిగత విషయాలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు చెప్పడం తెలుసుకొని పార్టీ నుంచి సాగనంపారన్నారు. ఆయన వ్యక్తిగతంగా తలబిరుసు మనిషి అని, డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారని విమర్శించారు. శనివారం వారు ఇడుపులపాయలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే జగన్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. రఘురామకృష్ణం రాజు వెంట ఏ ఒక్క వైఎస్ఆర్ సీపీ కార్యకర్తా వెళ్లడం లేదంటే.. ఆయనకు ఏ మేరకు రాజకీయ భవిష్యత్ ఉందో స్పష్టమవుతోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల్లో త్యాగం చేసిన ఎమ్మెల్యేగా తానూ ఒకడినని బాలరాజు చెప్పుకొస్తూ.. జగన్ మనస్తత్వం ఏమిటో తమకు తెలుసునని, ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు ఏమీ చేయలేవన్నారు.
మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీ యాలు
Published Sun, Feb 2 2014 3:46 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement