బలరాంపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం | Sharmila padayatra stratrs from balarampuram | Sakshi
Sakshi News home page

బలరాంపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

Aug 4 2013 10:38 AM | Updated on Aug 27 2018 9:19 PM

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర నేడు ఇచ్ఛాపురంలో ముగియనుంది. - Sakshi

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర నేడు ఇచ్ఛాపురంలో ముగియనుంది.

దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఆదివారం బలరాంపురం నుంచి ప్రారంభమైంది.

దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఆదివారం బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సరవదేవిపేట, అయ్యవారిపేట,లొద్దపుట్టి మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం పట్టణం చేరుకుంటారు. దాంతో ఆమె ప్రారంభించిన పాదయాత్ర నేటితో ముగియనుంది.
 

ఇచ్చాపురంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. నేటితో ఆమె ప్రారంభించిన పాదయాత్ర 230వ రోజుకు చేరుకుంది. 9 నెలల కాలంలో 14 జిల్లాల్లోని 116 నియోజకవర్గాల మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది. 3,112 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్రలో భాగంగా నడిచి దేశరాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డును సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement