జల్లెడ పడుతున్న పోలీసులు | polices cheks in ananthpur district | Sakshi
Sakshi News home page

జల్లెడ పడుతున్న పోలీసులు

Apr 23 2016 9:30 AM | Updated on Aug 21 2018 6:22 PM

అనంతపురం జిల్లా రాప్తాడు మండల కళాకారుల కాలనీలో పోలీసులు శనివారం తెల్లవారుజామున నాకా బందీ చేపట్టారు.

రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కళాకారుల కాలనీలో పోలీసులు శనివారం తెల్లవారుజామున నాకా బందీ చేపట్టారు. తిరుపాల్ అనే వ్యక్తిని దుండగులు హత్య చేసి పూడ్చి పెట్టిన దారుణం రెండు రోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో కాలనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు ఓ సీఐ, ఐదుగురు ఎస్‌ఐలతో పాటు మొత్తం 80 మంది వరకు పోలీసులు కళాకారుల కాలనీలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ఈ కాలనీలో స్థానికేతరులు ఎవరూ ఉండడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement