కర్ణాటక సమీపంలోని కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 80 లక్షల రూపాయిల నగదు పట్టబడింది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక సమీపంలోని కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 80 లక్షల రూపాయిల నగదు పట్టబడింది. పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డబ్బుతో పాటు ఐదు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నుంచి AP 21 AB1729 నెంబర్ వాహనంలో బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకెళ్లడానికి గల కారణాలు, వివరాల గురించి పోలీసులు కూలీ లాగుతున్నారు. కాగా తాము బంగారు వ్యాపారులమని అదుపులో ఉన్న వ్యక్తులు చెప్పినట్టు సమాచారం.