తాడేపల్లి రూరల్/సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణ గ్రామాల్లో జరిగిన దహనకాండపై పోలీసుల క్లూస్ టీం మంగళవారం నుంచి దర్యాప్తును ముమ్మరం చేసింది. సంఘటన స్థలంలో లభ్యమైన పాదముద్రల ఆధారంగా వివరాల సేకరణకు నడుంకట్టారు. తాడేపల్లిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, గతంలో ఉండవల్లి, పెనుమాక పంచాయతీల పరిధిలో చిన్నచిన్న గొడవల్లో తలదూర్చిన యువకులను, వీరితో పాటు రైతులను సైతం తాడేపల్లి పోలీసుస్టేషనుకు పిలిపించారు.
సంఘటన స్థలంలో దొరికిన పాదముద్ర ఆధారంగా, దానికి సరిపోలి ఉండే వారి పాదముద్రలు సేకరించారు. ఎందుకు పిలిపించారో తెలియక రైతులు ఒకింత అసహనానికి గురయ్యారు. రౌడీషీటర్లతోపాటు తమ పాదముద్రలు కూడా సేకరించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు జరిగిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా విచారణ పేరుతో ప్రతిరోజూ ఇలా పోలీసుస్టేషనుకు పిలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఇలా ప్రతిరోజూ స్టేషనుకు పిలిపించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే తమకు చావు తప్ప వేరేమార్గం లేదంటున్నారు.
మూడు రోజుల క్రితం పెనుమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, సంఘటనలో తాను పాల్గొన్నట్టు తెలిపి చివరకు పోలీసులను అయోమయానికి గురిచేశాడు. అతను అబద్ధాలు చె్డపుతున్నట్టు తేలడంతో తిరిగి విచారణ చేస్తున్నారు.
మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కొందరిని పిలిపించిన పోలీసులు వారు చెప్పిన ఆధారాల ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన నిపుణులతో ఇద్దరు నిందితులకు సంబంధించిన ఊహా చిత్రాలు సిద్ధం చేశారు.
వైఎస్సార్సీపీ వర్గీయులపై ఆగని పోలీసుల వేధింపులు...
దుశ్చర్యకు పాల్పడిన నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పోలీసులు పలువురు అనుమానితులను స్టేషన్లకు పిలిచి విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అనేక మంది వైఎస్సార్సీపీ వర్గీయులను విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
టీడీపీ వర్గీయుల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్ సీపీకి సంబంధించిన వారినే టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్స్టేషన్లలో కూర్చోబెడుతుండటంతో గ్రామాల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇప్పటికైనా పోలీసులు వివక్ష మాని విచారణ పారదర్శకంగా జరపాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
దహన కాండకు పాల్పడిన ఆ ఇద్దరూ ఎవరు..?
రాజధాని ప్రాంతంలోని పొలాల్లో దహన కాండకు పాల్పడింది ఇద్దరు వ్యక్తులేనని మొదటి నుంచి పోలీసులు చెబుతున్నప్పటికీ ఆ ఇద్దరూ ఎవరనేది తేలడంలేదు. కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం చూసినా ఇద్దరు వ్యక్తులే ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు మాత్రం పక్కా పథకం ప్రకారం సెల్ఫోన్, వాహనాలు వినియోగించకుండా జాగ్రత్తపడినట్లు అర్థమవుతోంది. ఈ కేసులో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.
పాదముద్రలు పట్టించేనా?
Published Wed, Jan 7 2015 2:32 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
Advertisement