‘బిడ్డను కేజీహెచ్‌కు తీసుకువెళ్లం’

Parents Rejects KGH Treatment For His Child In Visakhapatnam - Sakshi

అనంతగిరి: అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నా కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. మండలంలోని లంగుపర్తి పీహెచ్‌సీలో మల్లేపాడు గ్రామానికి చెందిన బీసాయి సన్యాసమ్మ మంగళవారం మూడో బిడ్డకు జన్మనించింది. జన్మించిన కుమారుడు శ్వాస సమస్యతో బాధపడుతున్నాడని, పీహెచ్‌సీ సిబ్బంది చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని గమనించి వెంటనే ఆ బిడ్డను విశాఖ కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే అందుకు వారు నిరాకరించి గ్రామానికి తీసుకుని వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top