కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం పోలవరంలో రెండు వర్గాల మధ్య భూవివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
కృష్ణా: కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలం పోలవరంలో రెండు వర్గాల మధ్య భూవివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం దాడులకు దారితీసింది. ఓ కుటుంబంపై ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భార్యభర్తలకు గాయాలు కాగా, కుమారుడు మృతిచెందినట్టు తెలిసింది.
సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.