20న ఉపకార వేతన అర్హత పరీక్ష | on 20 th Scholarship qualification exam | Sakshi
Sakshi News home page

20న ఉపకార వేతన అర్హత పరీక్ష

Apr 10 2014 1:40 AM | Updated on Jul 11 2019 5:01 PM

హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశం కోసం 20న ఉపకార వేతన

గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశం కోసం 20న ఉపకార వేతన అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మస్తాన్ షరీఫ్ ప్రకటనలో తెలిపారు. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరై, నెలకు రూ.8,000 లోపు ఆదాయం కలిగిన మైనార్టీ విద్యార్థులు సంస్థ నిబంధనల ప్రకారం ప్రవేశం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.

 

20వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే అర్హత పరీక్షకు పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ రెండు జీరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. ఉదయం 9.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్ : 98665 56838ని సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement