గోదావరి పుష్కరాల్లో స్నానానికి వచ్చిన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందింది.
కొవ్వూరు : గోదావరి పుష్కరాల్లో స్నానానికి వచ్చిన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు లోని గోష్పాదక్షేత్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలిని దెందలూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన కొండమ్మ(65) గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.