నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే? | nellore court complex bomb blast is may terrorist plan | Sakshi
Sakshi News home page

నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే?

Sep 14 2016 3:15 AM | Updated on Sep 4 2017 1:21 PM

నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే?

నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే?

నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు అల్ ఉమా పనేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు అల్ ఉమా ఉగ్రవాద సంస్థ పనేనా? పోలీసు వర్గాల్లో ఈ అభిప్రాయం వినిపిస్తోంది. చిత్తూరు, కేరళలోని కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ప్రాంగణాల్లో ఇటీవలి కాలంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇది కొనసాగింపనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ను భయభ్రాంతులు చేయడానికే ఈ చర్యకు పాల్ప డి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చిత్తూరు, కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ఆవరణాల్లో బాంబు పేలుళ్లు జరిగిన తీరు, అందులో వాడిన పేలుడు పదార్థాలు, వాటిని పేల్చిన తీరు గురించి ప్రత్యేక బృందం వివరాలు సేకరించింది.

ఈ పేలుళ్లకు నెల్లూరు పేలుడుకు దగ్గరి పోలికలు ఉండటంతో ఈ విధ్వంసం కూడా అల్‌ఉమా ఉగ్రవాద సంస్థ పనే అయిఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. డీఎస్పీ, ఇద్దరు సీఐలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్, జాతీయ నేరపరిశోధన సంస్థలు రంగంలోకి దిగాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం మంగళవారం నెల్లూరుకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించింది. స్థానిక అధికారులతో సమావేశమై వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement