నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.
గ్రామస్తులపైకి దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
Mar 11 2016 1:06 PM | Updated on Oct 20 2018 6:19 PM
విడవలూరు: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. 30 మంది రౌడీలను తెచ్చి గ్రామస్తులపై దాడి చేయబోయాడు. నెల్లూరు నగరం మూలాపేటకు చెందిన ఓ వ్యక్తికి చౌకుచర్ల గ్రామంలో 22 ఎకరాల పొలం ఉంది. గ్రామస్తుల దగ్గర కొంత మేర అప్పు తీసుకున్నాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు వచ్చాడు. అప్పు తీర్చిన తర్వాతే పంట కోయాలని గ్రామస్తులు సదరు వ్యక్తికి చెప్పారు. దీంతో తన అనుచరులు 30 మందిని మూడు ఆటోల్లో గ్రామానికి తీసుకు వచ్చాడు. వాళ్ల దగ్గర నాటు తుపాకులు, కత్తులు ఉండటం చూసి గ్రామస్తులు పోలీసులకు ఈ విషయం తెలిపారు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement


