► కృష్ణా పుష్కరాలకు విదిల్చింది కేవలం రూ.231 కోట్లే
► ఈ నిధులతో కొత్త ఘాట్ల నిర్మాణం అనుమానమే
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న కృష్ణా పుష్కరాలల్లో నీటిపారుదలశాఖ పనులకు ప్రభుత్వం రూ.231 కోట్లు కేటాయించింది. ఈ రూ.231 కోట్లు ఒక్క కృష్ణా జిల్లాకే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇందులో కృష్ణా జిల్లాకు కేవలం రూ.142 కోట్లు (ఇందులో రూ.66 కోట్లు వీఎంసీ ఖాతాకు), గుంటూరు జిల్లాకు రూ.65 కోట్లు, కర్నూలుకు రూ.24 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అడిగింది కొండంత..
పుష్కరాల కోసం కృష్ణాజిల్లాలోని 118 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసేందుకు రూ.393.60 కోట్లు, అలాగే గుంటూరు జిల్లాలోని 95 ఘాట్ల మరమ్మతులకు రూ.59.56 కోట్లు కావాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. కాగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని మొత్తం 222 ఘాట్ల పునరుద్ధరణకు రూ.468.87 కోట్లు కావాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు కలిపి కేవలం రూ.231 కోట్లు విదిల్చింది. ఈ మొత్తంతోనే 222 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు తప్ప మొత్తం అన్ని ఘాట్లను ఎప్పుడూ ఉపయోగించరు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కూడా ముఖ్యమైన కొన్ని ఘాట్లే వినియోగిస్తారు.
అందువల్ల చాలా ఘాట్లలో సిమెంట్ ఫ్లోరింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే దివిసీమలో కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయాలనిడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.231 కోట్లతో పనులు అరకొరగానే జరిగే అవకాశం కనపడుతోంది.
చైనా టెక్నాలజీ వినియోగం..
హెడ్ వాటర్వర్క్ నుంచి ఫెర్రీ వరకు సుమారు 12 కి.మీ పొడవునా చైనా నిపుణుల సహకారంతో కొత్త ఘాట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి విషయం అటుంచితే ముందుగా ప్రకాశం బ్యారేజ్నుంచి దిగువన ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. వీటికి సంబంధించి టెండర్లు త్వరలోనే ఖరారు చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
అడిగింది కొండంత.. ఇచ్చింది గోరంత
Published Sun, Apr 10 2016 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement