సమైక్యవాదం పేరుతో కుట్రలు చేస్తున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ సిటీ, న్యూస్లైన్: సమైక్యవాదం పేరుతో కుట్రలు చేస్తున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే నేతలకు ఈ ప్రాంతంలో స్థానం లేదంటూ జిల్లా వ్యాప్తంగా బుధవారం కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీఆర్ఎస్ యూత్ జిల్లా కమిటీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఆరెపల్లి, వార్షికోత్సవానికి తన సతీమణి శాంతితో హాజరయ్యారు. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని ఫైటింగ్ సీన్ కోసం రామప్పలో జరిగిన షూటింగ్కు వచ్చారు. వరంగల్ స్వర్ణా ప్యాలెస్లో జరిగిన ఓ కాంగ్రెస్ నాయకుడి కూతురు వివాహానికి హాజరయ్యారు. మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు వివాహానికి, మనుమరాలు పుట్టినరోజుకు నగరానికి వచ్చారు.
వరంగల్లో షూటింగ్, ఇతర పనుల నిమిత్తం వచ్చిన సమయంలో తన అభిమానులను పలకరించేవారు. అభిమానుల కుటుంబ బాగోగులను సైతం అడిగితెలుసుకునేవారు. ఆయన వరంగల్కు వచ్చిన సందర్భంలో అభిమానులు రవిపెద్ద, అంకం జ్ఞానేశ్వర్, కొక్కుల సతీష్, దామెర సర్వేష్, గర్దా జయప్రకాష్, ఎర్ర సమ్మయ్య, రవిప్రసాద్లను కలిసేవారు.