విశాఖలో మైనింగ్‌ మాఫియా అక్రమాలు.. | Illegal Mining Mafia In Vishakapatnam | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

Jul 17 2020 5:58 PM | Updated on Jul 17 2020 6:28 PM

Illegal Mining Mafia In Vishakapatnam  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వీవీఆర్‌ గ్రూప్‌లో దాడులు చేశారు. 

ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్‌తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్‌ గ్రూప్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement