మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

Illegal Mining Mafia In Vishakapatnam  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వీవీఆర్‌ గ్రూప్‌లో దాడులు చేశారు. 

ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్‌తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్‌ గ్రూప్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top