వేడుకగా శ్రీవారికి పుష్పార్చన | grand puspayagam in Tirumala | Sakshi
Sakshi News home page

వేడుకగా శ్రీవారికి పుష్పార్చన

Nov 18 2015 2:15 PM | Updated on Sep 3 2017 12:40 PM

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వార్లకు పుష్పయాగం కార్యక్రమానికి తిరుమలలో బుధవారం మధ్యాహ్నం అంకురార్పణ జరిగింది.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వార్లకు పుష్పయాగం కార్యక్రమానికి తిరుమలలో బుధవారం మధ్యాహ్నం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయం లోపల కల్యాణోత్సవ మండపంలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ యాగం కోసం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను సిద్ధం చేశారు. 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, శ్రీవారి దర్శనార్థం గవర్నర్ నరసింహన్ తిరుమల చేరుకున్నారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement