సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రభుత్వ నియామకాల్లో తెలుగు తమ్ముళ్ల జోక్యం పెరుగుతోంది. ఉద్యోగులుగా ఎవరిని నియమించాలో, ఎవరిని నియమించ కూడదో ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీడీపీ నేతల మితిమీరిన జోక్యాన్ని ప్ర భుత్వ అధికారులు భరించలేకపోతున్నా రు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. జిల్లాలో వీరు 116 మంది ఉన్నారు. మరో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కూడా తొలగించారు.
వీరు మూడు వారాలుగా నెల్లూరులో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అందరూ హైదరాబాద్ వెళ్లి సీఎం చంద్రబాబును కలిశారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, సీనియారిటీని బట్టి సగం మందికి అవకాశం ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీనియారిటీ ప్రకారం ఎవరిని నియమించాలనే విషయంలో ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ)కి అధికారమిచ్చారు. గత ప్రభుత్వం మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున 116 మందిని నియమించింది. ప్రస్తుతం వీరిలో దాదాపు సగం మందికే అవకాశం ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే తాము ఎవరి పేర్లు సూచిస్తే వారినే నియమించాలని తెలుగు తమ్ముళ్లు పీడీ దగ్గర వాదిస్తున్నారు. మొత్తం జాబితాను తమకు ఇస్తే, వాటిలో తమకు కావలసిన వారి పేర్లను తెలియజేస్తామని, వారిని మాత్రమే నియమించాలని శాసిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు దిక్కు తోచని పరిస్థితికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి అవకాశం ఇవ్వకూడదని బెదిరిస్తున్నారు. రాజకీయంగా విభేదాలు వస్తే సీనియర్లతో సంబంధం లేకుండా కొత్త వారిని నియమించేం దుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదెక్కడి న్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఉద్యోగి మాట్లాడుతూ పదేళ్లుగా పని చేస్తున్న తమను తీసి వేసి, టీడీపీ కార్యకర్తలను నియమించుకునేందుక ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం నియమించిన ఉద్యోగులను తొలగించ డం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇదే కొనసాగితే కలెక్టరేట్ ఆందోళన చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించా రు. తెలుగు తమ్ముళ్ల పెత్తనం ఈ ఉద్యోగాల విషయానికే పరిమితం కాలేదని, వివిధ శాఖల్లో నియామకాల పేరుతో ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తెలుగు తమ్ముళ్లకే నియామక అధికారాలు ఇస్తే, తాము ఇంట్లో కూర్చోవడం మేలని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నియామకాల్లో ‘తమ్ముళ్ల’ జోక్యం
Published Sat, Sep 6 2014 3:23 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement