పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు: పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, ఒక రివాల్వర్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ నలుగురు నల్లకాలువ స్మృతివనం సమీపంలో పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపీడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు చెప్పారు.