కూతురి మరణం: గుండెపోటుతో తండ్రి మృతి | Father dies after hearing about death of daughter in guntur district | Sakshi
Sakshi News home page

కూతురి మరణం: గుండెపోటుతో తండ్రి మృతి

Jul 19 2014 1:11 PM | Updated on Aug 16 2018 4:36 PM

కూతురి మరణవార్త విని తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఓ కాంపౌండర్ చేసిన పొరపాటు.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వచ్చీరాని వైద్యంతో గర్భిణికి కాన్పు చేయడంతో ఆమె మరణించింది. పండంటి మనవడిని ఇస్తుందనుకున్న కన్నకూతురు కాస్తా శవంగా తిరిగిరావడంతో గుండెపగిలిన ఆమె తండ్రి కూడా ప్రాణాలు వదిలేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది.

ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన వోగిబోయిన నాగలక్ష్మి (19) అనే మహిళ కాన్పు కోసం గురువారం సాయంత్రం వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు రాత్రి 11 గంటలకు ఆమెకు కాన్పు అయ్యింది. అయితే డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో కాంపౌండర్ కాన్పు చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.

ఆ సమయంలో కాంపౌండర్ అజాగ్రత్త వల్ల బాలింతకకు అధిక రక్తస్రావం కావటంతో చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో శుక్రవారం మృతిచెందింది. ఈ వార్త విన్న నాగలక్ష్మి తండ్రి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కాంపౌండర్ కాన్పు చేయటంపై మృతురాలి బంధువులు ప్రభుత్వ వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement