అటవీ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగులు | Sakshi
Sakshi News home page

అటవీ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగులు

Published Thu, Dec 18 2014 5:11 PM

elephants killed forest employee

చిత్తూరు:  చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ అటవీ ఉద్యోగిని తొక్కి చంపాయి. రామకుప్పం మండలం ననియాల గ్రామంలో అటవీశాఖ ఉద్యోగి మునియప్పపై ఏనుగులు దాడి చేశాయి. మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ మండలంలోని పంటపొలాలపై ఏనుగులు తరచూ దాడులు చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. లక్షల రూపాయల విలువైన పంటలు ధ్వంసం చేశాయి. ఈ రోజు చేసిన దాడిలో అటవీ ఉద్యోగి దుర్మరణం చెందారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement