తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Sakshi


తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) 60,449 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారి హుండీకి రూ. 2.07 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top