'ప్రజలకు శ్వేతపత్రం కాదు... అభివృద్ధి కావాలి' | Devineni Nehru takes on TDP Government | Sakshi
Sakshi News home page

'ప్రజలకు శ్వేతపత్రం కాదు... అభివృద్ధి కావాలి'

Jul 5 2014 11:59 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది అభివృద్దే కానీ శ్వేతపత్రం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పరోక్షంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది అభివృద్దే కానీ శ్వేతపత్రం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పరోక్షంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పాలనలో అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని... ఎలాంటి విచారణకైనా కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగోట్టవద్దని టీడీపీ నేతలకు దేవినేని నెహ్రూ హితవు పలికారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే శ్వేత పత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్ర ప్రజలకు అభివృద్దే కానీ శ్వేత పత్రాలు కాదంటు నెహ్రూపై విధంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement