ఏపీలో పెరిగిన కరోనా కేసులు: Today Corona Positive Cases in Andhra Pradesh (AP) - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు

May 20 2020 11:18 AM | Updated on May 20 2020 1:19 PM

Coronavirus Cases Rised To 2407 In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 68 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా గత 24 గంటల్లో కొత్తగా 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్‌ కాగా, కరోనాతో ఇవాళ కర్నూలు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 715 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
(కరోనా.. ఒక్క రోజే 5,600 కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement