టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలోని వర్షపీడిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప తెలిపిన
నేడు చంద్రబాబు జిల్లా పర్యటన
Oct 28 2013 2:34 AM | Updated on Aug 10 2018 7:58 PM
సాక్షి, కాకినాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలోని వర్షపీడిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నుంచి ఉదయం 11 గంటలకు తుని మీదుగా అన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తొండంగి, ఒంటిమామిడి, కోనపాప పేట, పిఠాపురం, గొల్లప్రోలుల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. అనంతరం తాటిపర్తి, వన్నెపూడి, ప్రత్తిపాడుల్లో పర్యటించి సుద్దగడ్డ కాలువ ముంపు బాధిత రైతులను, ప్రజలను పరామర్శిస్తారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళతాతరు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు రాజప్ప విజ్ఞప్తి చేశారు.
Advertisement


