అప్పట్లో తప్పుచేశా.. ఓడిపోయా | chandrababu naidu comments on 2004 defeat | Sakshi
Sakshi News home page

అప్పట్లో తప్పుచేశా.. ఓడిపోయా

Sep 12 2014 8:06 AM | Updated on Jul 28 2018 3:23 PM

అప్పట్లో తప్పుచేశా.. ఓడిపోయా - Sakshi

అప్పట్లో తప్పుచేశా.. ఓడిపోయా

గతంలో సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించానని, అందువల్లే 2004లో అధికారంలోకి రాలేకపోయానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్: గతంలో సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించానని, అందువల్లే 2004లో అధికారంలోకి రాలేకపోయానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లడానికి దీర్ఘ, స్వల్పకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగిన గ్రేట్‌లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ దశమ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బిజినెస్ స్కూళ్ల ఏర్పాటుకు కృషి చేశానన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈవో జీవీ ప్రసాద్, పీపు ల్స్ కాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు శ్రీనిరాజు, గ్రేట్‌లేక్స్ చైర్మన్ బాల వి బాలచంద్రన్ తదితరులు ప్రసంగించారు.

 గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

 ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో గురువారం భేటీ అయ్యారు.
 
చంద్రబాబుతో ఫేస్‌బుక్ డెరైక్టర్ భేటీ

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫేస్‌బుక్ ఇండియా డెరైక్టర్ అంకీదాస్ గురువారం భేటీ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement