ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సోమవారం సెక్రటేరియట్లో ఈ భేటీ జరుగుతోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తున్న రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న విషయంపై చంద్రబాబు చర్చిస్తారు.
రాజధాని భూసేకరణ ప్రాంత రైతులతో కూడా చంద్రబాబు ఈ రోజు సమావేశమై పరిహారాన్ని ప్రకటించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించనున్నారు.