అల్ప పీడనం.. మత్సకారులకు హెచ్చరిక

AP Disaster Management Weather Forecast In Visakhapatnam - Sakshi

సాక్షి, విజయవాడ: దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆంధ్ర ప్రదేశ్‌ విపత్తు నిర్వాహణ శాఖ డైరెక్టర్‌ వెల్లడించారు. కాగా వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ అండమాన్‌ తీరంలో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండే అవకాశం లేదన్నారు. దీని ప్రభావం వల్ల ఆగ్నేయా బంగాళాఖాతం, దక్షిణ అండామాన్‌ సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయన్నారు. ఇక ఆంధ్ర కోస్టు తీరంలో చాపల వేటకు వెళ్లే మత్సకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపుకు వెళ్లోద్దని డైరెక్టర్‌‌ హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top