పాలమూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం | 16 year old gangraped by three men in Mahbubnagar district | Sakshi
Sakshi News home page

పాలమూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం

Oct 16 2013 10:43 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం ఎండపెట్ల గ్రామంలో బుధవారం గత అర్థరాత్రి 16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం ఎండపెట్ల గ్రామంలో బుధవారం గత అర్థరాత్రి 16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు తెలిపింది. దాంతో వారు బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే స్పందించారు.

 

కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నాగర్ కర్నూల్ పోలీసులు తెలిపారు. అయితే సామూహిక అత్యాచారానికి గురైన యువతిని మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement