breaking news
-
ముత్యాలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన బాలికపై గ్యాంగ్రేప్
పాడేరు: కూటమి పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదనటానికి ఈ దారుణ సంఘటన మరో ఉదాహరణ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారం చేశారు. ఈ దారుణంపై సెపె్టంబర్ 13న ఫిర్యాదు చేసినా చింతపల్లి పోలీసులు స్పందించలేదు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్కు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆ బాలికతో పాటు గిరిజన నాయకులు బాలకృష్ణ (కాంగ్రెస్), చంటిబాబు (సీపీఐ) తదితరులు కలెక్టరును కలిసి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు.. సెపె్టంబర్ 5న లంబసింగికి చెందిన తెలిసిన మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనవెంట తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక తోటమామిడికి చెందిన యువకుడి బైక్పై వారు నర్సీపట్నం వెళ్లారు. అక్కడి నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన యువకుడి కారులో వీరు ముగ్గురు విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బాలికను బంధించి తోటమామిడి యువకుడు, వంజరి యువకుడు 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. నాలుగో రోజు నర్సీపట్నం తీసుకొచ్చి లాడ్జిలో ఉన్నారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు రూ.100 ఇప్పించి, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బాలిక సెపె్టంబర్ 12న కుటుంబ సభ్యులకు నర్సీపట్నం నుంచి ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు సెపె్టంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చారు. అయినా పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్ను కోరారు. అనంతరం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. -
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
చిత్తూరు దేవళం పేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, చిత్తూరు: సాక్షి, చిత్తూరు: వెదురుకుప్పం మండలం దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో స్థానిక సర్పంచ్ ఆధ్వరంలో దళిత సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ నిరసనలకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ అక్కడికి చేరుకుని దళిత సంఘాల నేతలకు సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు స్థానికులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు. దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలి లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత అర్ధరాత్రి ఎవరో నిప్పు పెట్టారు(Ambedkar Statue fire Incident). అయితే.. టీడీపీ నేత సతీష్ నాయుడు(TDP Leader Satish Naidu), అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విగ్రహానికి నిప్పు పెట్టినవాళ్లను అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఆస్తి కోసం భర్త హత్య
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడ్ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు.. గుంటూరు పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ చెన్నంశెట్టి గోవిందరాజుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన లక్ష్మీతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య, భర్త మధ్య గొడవలు చెలరేగడంతో.. ఆరేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం లక్ష్మీకి సత్తెనపల్లికి చెందిన పేర్నేపాటి వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ నేపథ్యంలో గోవిందరాజు కుటుంబానికి సంబంధించిన రూ.1.5 కోట్ల ఆస్తి గురించి తెలుసుకున్న లక్ష్మి భర్తను హత్య చేసి.. ఎలాగైనా ఆస్తిలో వాటా దక్కించుకోవాలని భావించింది. ఇందుకు వెంకటేశ్వర్లుతో కలిసి కుట్ర పన్నింది. ఆ ప్రకారం.. వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ ఖాసిం సైదా సెపె్టంబర్ 18న ఆటోలో గోవిందరాజు ఇంటికి వెళ్లారు. వెంకటేశ్వర్లు, గోవిందరాజుకు గతంలో పరిచయం ఉంది. దీంతో ముగ్గురూ కలసి ఆటోలో తిరుగుతూ మద్యం తాగారు. ఈ క్రమంలో సాతులూరు, పెదరెడ్డిపాలెం గ్రామాల మధ్య.. గోవిందరాజుతో వెంకటేశ్వర్లు గొడవ పడ్డాడు.పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోవిందరాజును.. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో మోది హత్య చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీకి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని 19వ తేదీన పెదపలకలూరు తేజ గార్డెన్స్ సమీపంలో పడేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ నాగూర్మీరాసాహెబ్, సిబ్బంది దర్యాప్తు చేసి.. వెంకటేశ్వర్లు, అతని మిత్రుడు షేక్ ఖాసింసైదాను అరెస్టు చేశారు. -
సీఎం సొంత జిల్లాలో అమానుషం.. బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు టీడీపీ మూకలు వంతులేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. స్నేహితుడి గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. చిత్తూరులో జరిగిన ఈ ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఫారెస్టు ఆఫీసర్లమంటూ బెదిరించి.. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి సెపె్టంబర్ 25వ తేదీ మధ్యాహ్నం పెనుమూరు క్రాస్లోని అటవీ శాఖకు చెందిన నగరవనం పార్కుకు వెళ్లింది. ఇద్దరూ ఓ బెంచీపై కూర్చుని మాట్లాడుకుంటుండగా.. సంతపేటకు చెందిన హేమంత్, మురకంబట్టు అగ్రహారానికి చెందిన మహేశ్, కిశోర్తో పాటు మరికొందరు టీడీపీ వర్గీయులు పార్కు లోపలికి వచ్చారు. ఒంటరిగా కూర్చున్న వీరిద్దరి వద్దకు వెళ్లి.. ‘మేము ఫారెస్టు ఆఫీసర్లం. మీకు ఇక్కడేం పని? మీపై మాకు అనుమానం ఉంది. స్టేషన్కు పదండి’ అంటూ బెదిరించారు.తాము స్నేహితులమని.. మాట్లాడుకోవడానికి వచ్చామని చెబుతున్నా వినకుండా.. వారిద్దరినీ పార్కులోని పొదల్లోకి లాక్కెళ్లారు. ప్రతిఘటించిన బాలిక స్నేహితుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కడుపుపై తన్ని.. మొహంపై పిడిగుద్దులు గుద్దారు. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అరవకుండా అతని నోరు మూసేశారు. అతడి కళ్లెదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ.. దాదాపు రెండు గంటల పాటు కీచకపర్వం సాగించారు. ముగ్గురు లైంగిక దాడికి పాల్పడగా.. మిగిలిన వారు బాలికను అసభ్యకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందినట్లు తెలిసింది. ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. టీడీపీ కండువాతో నిందితులు మహేశ్, హేమంత్ పంచాయితీకి ప్రయత్నించిన టీడీపీ నాయకులు..! ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు, కార్పొరేటర్.. గుట్టుచప్పుడు కాకుండా పంచాయితీ చేసేందుకు యత్నించినట్లు సమాచారం. జరిగిన ఘోరాన్ని బాలిక స్నేహితుడు.. తన కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు పార్కు సమీపంలోని హోటల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి.. 29వ తేదీన నిందితులను పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేశారు. ఆ సమయంలో నిందితుల ఫోన్లలో ఘటనకు సంబంధించిన ఏడు వీడియోలను గుర్తించినట్లు తెలిసింది. పట్టించుకోని పోలీసులు.. అంతకుముందు యువకుడి కుటుంబసభ్యులు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. సీఐ, ఎస్సై అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది జవాబిచి్చనట్లు సమాచారం. పోలీస్స్టేషన్లో ఉన్న సిబ్బంది సైతం సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాళ్లు వెనుదిరిగినట్లు తెలిసింది. నిందితులకు దేహశుద్ధి జరిగిన విషయం బయటకురావడంతో పోలీసులు.. బాలిక స్నేహితుడి నుంచి సోమవారం రాత్రి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నిందితులు ముగ్గురూ టీడీపీ కండువాలతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్రావు, టీడీపీ నాయకుడు ఎల్బీఐ లోకేశ్, కార్పొరేటర్ నవీన్తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మంగళవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ నాయుడు, సీఐలు శ్రీధర్ నాయుడు, మహేశ్వర మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక ఫిర్యాదు మేరకు.. హేమంత్, మహేశ్, కిశోర్ అనే ముగ్గురిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. -
గోడ కూలి ముగ్గురు దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లో జరిగింది. వివరాలు.. నందవరానికి చెందిన బలుదూరు లక్ష్మీదేవి మూడేళ్లుగా తన ఇద్దరు కుమారులు నాగరాజు(45), రాజు(39), మనవడు లక్ష్మీనరసింహ(14)తో కలసి గుడేకల్లోని నీలకంఠశ్వేరస్వామి దేవాలయం స్థలంలో ఉన్న గోడకు రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తోంది.సోమవారం రాత్రి వారంతా భోజనం చేసి నిద్రపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిన రాతి గోడ.. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వారిపై పడింది. కేకలు విన్న స్థానికులు వచ్చి వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ తండ్రి నాగరాజు, కుమారుడు లక్ష్మీనరసింహ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రాజు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. లక్ష్మీదేవి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. -
హాస్పటల్లో వైద్యం వికటించి బాలింత మృతి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని స్మైలీ హాస్పటల్లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పట్టణంలోని చెరువు బజారు చెందిన గుంజా గాయత్రి (25) ని ప్రసవం కోసం నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు.ప్రసవం అయిన తర్వాత గాయత్రి పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడలోని స్మైలీ ప్రధాన ఆసుపత్రికి తరలించారు .అయితే తనకు బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించడంతో చికిత్సపొందుతూ గాయత్రి మరణించింది. దాంతో గాయత్రి మృతదేహాన్ని జగ్గయ్యపేట స్మైలి హాస్పిటల్కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన బంధువులు. భారీగా మోహరించిన పోలీసులు. -
దారుణం: ఏపీ యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం
తిరువణ్ణామలై: తమిళనాడు:రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఏపీకి చెందిన యువతిపై తమిళనాడు పోలీసులు అత్యారానికి పాల్పడ్డారు. తిరువణ్ణామలైలో ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్స్ సుందర్ రాజ్, సురేష్ రాజ్లు సదరు యువతిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అత్యాచారం చేసిన పోలీసులను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఈ దారుణం చోటు చేసుకుంది. టమోటో లోడ్తో వెళుతున్న వాహనంలో డ్రైవర్తో పాట ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ సమయంలోనే గస్తీ కాస్తున్న ఇ ద్దరు పోలీసులు.. ఆ వాహనాన్ని ఆపారు. వాహనంలో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన ఆ ఇద్దరు పోలీసులు.. మహిళల్ని కిందకు దింపారు. అందులో లక్ష్మీ అనే యువతిని విచారణ పేరతో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సమయంలో ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడి బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన గ్రామస్తులు లక్ష్మిని రక్షించి, 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తిరువన్నమలై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ సతీష్ బాధితురాలిని విచారణ చేశారు. దాంతో పోలీసలే తనను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధితరాలు చెప్పడంతో అసల విషయం వెలుగచూసింది.ఇదీ చదవండి:తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు -
వైద్యం అందక ఐదేళ్ల బాలుడి మృత్యువాత
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక శుక్రవారం ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన నిరుపేద కూలీ హరిజన కేటీ రాజేష్, సరిత దంపతుల ఐదేళ్ల కుమారుడు అహరోన్కుమార్ నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతుండడంతో ఉరవకొండ లోని గుంతకల్లు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు. దీంతో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నైట్ డ్యూటీ డాక్టర్ ఇస్మాయిల్తోపాటు ఏఎన్ఎంలు ప్రియాంక, అంజన ఉన్నారు. డాక్టర్ ఆస్పత్రి పై భవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా, నర్సు ప్రియాంక తానే తెలిసిన వైద్యం చేసి ఇంజక్షన్ తోపాటు సెలైన్ పెట్టారు. డాక్టర్ను పిలిచి ఒకసారి బాబు పరిస్థితి చూడాలని కుటుంబ సభ్యులు చెప్పినా ఏఎన్ఎం పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబు పరిస్థితి విషమించడంతో డాక్టర్ ఇస్మాయిల్ హుటాహుటిన వచ్చి పరీక్షించారు. అప్పటికే బాబు మృతి చెందాడు. పుట్టిన రోజు జరిగిన నాలుగు రోజులకే బాబు మృతిచెందడం బాధాకరం. ఆందోళనతో దిగివచ్చిన అధికారులు దీంతో ఆస్పత్రి ఎదుట బాబు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి ఉరవకొండ అర్బన్ సీఐ మహనంది, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వరాజ్ కూడా ఆస్పత్రికి వచ్చి శాఖా పరమైన విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర నివేదికను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్తో పాటు కలెక్టర్కు సమరి్పస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కుజభంగిలో వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కుజభంగికి చెందిన ప్రవీణ్ కుమార్ భార్య అగతంబిడి లావణ్యకు రెండు నెలల క్రితం బిడ్డ జన్మించింది. ఈ నెల 24న గ్రామంలో వైద్య సిబ్బంది పసికందుకు వ్యాక్సిన్ వేశారు. అప్పటి నుంచి బిడ్డకు జ్వరం వస్తూనే ఉంది. శుక్రవారం తెల్లవారు జామున ఊపిరాడకపోవడంతో బిడ్డ మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై స్థానిక వైద్యాధికారి పి.రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పసరు మందు పట్టించడం వల్లే పసికందు మృతి చెందిందన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేస్తే సాధారణ జ్వరం ఉంటుందని, పుట్టుకతోనే పసికందుకు మూర్ఛ లక్షణాలు ఉన్నాయన్నారు. మూర్ఛ ఉన్నట్టు తెలియక బాధిత కుటుంబీకులు పసరు మందును పట్టించడంతో పరిస్థితి విషమించి పసికందు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు.డెంగీతో బాలుడి మృతి గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలో రెండేళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరి(2)కి పది రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో రక్తపరీక్ష చేయించారు. డెంగీగా నిర్ధారణ కావడంతో ఎమ్మిగనూరులోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. ఆరి్థక స్థోమత లేని తల్లిదండ్రులు.. నరహరిని సోమవారం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నరహరి శుక్రవారం మరణించాడు. -
జమ్మూ కశ్మీర్లో బాపట్ల సైనికుడి మృతి
బాపట్ల టౌన్: జమ్మూ కశ్మీర్లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వర్తిస్తూ బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందారు. బాపట్ల మండలం, కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ(33) బుధవారం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా, తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సైనికుడి మృతిపై విచారణ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. జిల్లా పోలీస్ అధికారులు, సూర్యలంక ఎయిర్ ఫోర్స్, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు, ఎన్సీసీ అధికారులు, ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు కంకటపాలేనికి చేరుకొని సైనికుడి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతునికి భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది. -
నెల్లూరు చిన్నారుల అదృశ్యం విషాదాంతం
సాక్షి, నెల్లూరు: ఉయ్యాలపల్లి చిన్నారుల అదృశ్యం ఘటన.. విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతదేహాలుగా కనిపించడంతో ఆ తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ పరిణామంతో.. మిస్సింగ్ కేసును మిస్టరీ డెత్ కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉయ్యాలపల్లి(Uyyalapalli) గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష్ణువర్దన్, శ్రవణ్లు బుధవారం మధ్యాహ్నాం ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేపట్టారు. ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి ఉంటారనే స్థానికులు చెప్పడంతో డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..గురువారం విష్ణువర్దన్ మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. దీంతో అధికారులు ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. ఆపై అనుమానంతో కొంత నీటిని బయటకు తోడేయడంతో శ్రవణ్ మృతదేహాం కూడా బయటపడింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
చిత్తూరులో దారుణం.. బాధితురాలిపై పోలీసుల లైంగిక దాడి?
సాక్షి, పలమనేరు: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన ఓ మహిళపై కానిస్టేబుల్ అడవిలో లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే..గంటావూరుకు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేధింపులతో ఆమె నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. బాధితురాలు అందంగా ఉందని సీఐ డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్కుమార్.. ఆమెపై కన్నేసి ప్లాన్ చేశాడు. (కిరణ్ ప్రస్తుతం సోమలలో పనిచేస్తున్నాడు) ఫిర్యాదులోని ఫోన్ నంబరును తీసుకుని తాను న్యాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డు ఉమాశంకర్కు (ఇప్పుడు పుంగనూరులో విధులు నిర్వహిస్తున్నాడు) తన బాధను తెలుపుకుంది.దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్ కూడా నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆపై అతడు కూడా రాత్రుల్లో ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగు ఆ ఇద్దరి వేధింపులతో ఏం చేయలేని బాధితురాలు తీవ్రంగా మనోవేదన అనుభవించింది.ఎస్పీని కలిసి న్యాయం చేయాలని..తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులు ఎలాగూ న్యాయం చేయరని భావించి తాజాగా జిల్లా ఎస్పీగా వచ్చిన తుషార్డూడిని ఇటీవలే కలిసి జరిగిన ఘోరంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే దీనిపై విచారణ చేయాలని పలమనేరు సీఐ మురళీమోహన్కు అప్పజెప్పారు. సంఘటన జరిగింది తన పరిధి కాదని బంగారుపాళెం సీఐని కలవాలని ఆయన చెప్పారు. దీంతో బాధితురాలు బంగారుపాళెం సీఐని కలిసింది. ఆ కానిస్టేబుల్కు అధికార పార్టీ అండదండలు ఉండడం, నిందితుడు పోలీసు కావడంతో అప్పట్లో ఎఫ్ఐఆర్ వేయకుండా కాలయాపన చేశారు. ఎస్పీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందిన బాధితురాలు బుధవారం చిత్తూరులో ప్రెస్మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. విషయం మీడియాకు చేరడంతో వెంటనే స్పందించిన పోలీసులు బుధవారమే ఎఫ్ఐఆర్ వేశారు. బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని..భర్త వదిలేయడం, న్యాయం కోసం వెళ్తే ఇలా లైంగిక వేధింపులతో బతకడం ఇష్టంలేక రెండు నెలల కిందట మొగిలి సమీపంలోని దేవరకొండలో ఆలయం వద్ద ఆత్మహత్య చేసుకుందామని బాధితురాలు నిర్ణయించుకుంది. ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పీఎస్కు చెందిన ఇరువురు కానిస్టేబుళ్లు బాధితురాలిని చూసి అడవిలో ఎందుకున్నావని ఆరా తీశారు. తనది పలమనేరని చెప్పగా తెలిసినవారెవరైనా ఉన్నారా అనగానే.. ఆమెను వేధిస్తున్న కానిస్టేబుల్ నంబరు ఇచ్చింది.దీంతో వారు అతడికి కాల్ చేయగా ఆమె తనకు తెలుసునని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీన్ని అదునుగా భావించిన ఆ కానిస్టేబుల్ ఓ కారులో ఇక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్డ్రింక్ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేసినట్టు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. జరిగిన విషయంపై ఎవరికై నా చెబితే ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో బాధితురాలు ఏం చేయలేకపోయింది.అయితే, బాధితురాలు మీడియా సమావేశానికి ముందే ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వినిపిస్తోంది. పోలీసులకైతే ఓ న్యాయం సామాన్యులకైతే మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొందరు కానిస్టేబుళ్ల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే ప్రజల్లో నమ్మకం లేకుండా పోతోంది. దీనిపై జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సైబర్ వల..చిక్కితే విలవిల..!
సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకరిద్దరు కాదు చాలామంది సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు నష్టపోతున్నారు. పార్ట్టైం, ఫుల్టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆన్లైన్లో ఫేక్ లింక్లు పెట్టి వాటిని క్లిక్ చేసేలా ఆశ చూపించి మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ యాప్లు, ఫేక్ లింక్ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు... » బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్, యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం, డెబిట్కార్డు, క్రెడిట్కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. » డిజిటల్ లావాదేవీలకు బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లు స్కానింగ్ లేదా ఎంపిన్ లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి. » ఏదైనా ఫోన్కాల్, ఈ–మెయిల్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేయాలని వివరాలు అడిగినా చెప్పరా దు. ఒకవేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. హోం బ్యాంక్ శాఖను సంప్రదించాలి. » ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లలో యూఆర్ఎల్, డొమైన్ పేర్లను స్పెల్లింగ్ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం అధికార వెబ్సైట్లనే ఉపయోగించాలి. » ఏదైనా వెబ్సైట్, అప్లికేషన్లో మీ ఈమెయిల్ను యూజర్ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్ పాస్వర్డ్ను ‘పాస్వర్డ్’ అని పెట్టుకోవద్దు.ఆన్లైన్ ఉద్యోగం పేరుతో మోసం...అనకాపల్లిలో గవరపాలేనికి చెందిన మణికంఠ అమెజాన్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్లో కంపెనీ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఇది పార్ట్టైమ్ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పడంతో రిజి్రస్టేషన్ కోసం రూ.1,000లు ఫోన్పే చేశాడు. కొద్ది రోజుల్లోనే మణికంఠ ఖాతాలో రూ.1,400 జమ అయ్యాయి. దీంతో పార్ట్టైమ్ ఉద్యోగం బావుందని నమ్మిన ఆ యువకుడు నిర్వాహకులు చెప్పిన విధంగా దపదఫాలుగా రూ.1.80 లక్షలు పంపించాడు. తర్వాత అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్ చేశారు.అచ్యుతాపురం కేంద్రంగా సైబర్డెన్...అచ్యుతాపురంలో ఒక అపార్ట్మెంట్లో సైబర్ డెన్ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కాల్ సెంటర్ను నడుపుతూ ప్రజల వ్యక్తిగత బ్యాంక్ వివరాలు మోసపూరితంగా సేకరించి, ఖాతాల్లోని డబ్బులను మాయం చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారిని కూడా టార్గెట్ చేసే ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులను సీఐడీకి అప్పగించారు.ఆన్లైన్ లింక్లు క్లిక్ చేయవద్దు.. బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ అడగరు. అలా అడిగితే అది సైబర్ నేరగాళ్ల పనే. ఆన్లైన్ లింక్లు వస్తే వాటిని క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే వెంటనే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయొద్దు. ఒకవేళ చేశారంటే మీ బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరినట్టే. ఫేస్బుక్కుల్లో కూడా అందమైన అమ్మాయిల పేరిట హానీ ట్రాప్, లింక్లు పెట్టి మోసం చేస్తారు. అలా జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు తెలియజేయాలి. – సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్నకిలీ ఆన్లైన్ షాపింగ్ వలలో పడొద్దు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే బ్యాంక్ ఖాతాల్లో నగదు ఫ్రీజ్ చేస్తాం. అలా ఫ్రీజ్ చేసిన సొమ్మును అనేక కేసుల్లో బాధితులకు ఇప్పటికే అప్ప గించాం. పండగల సమయాల్లో నకిలీ ఆన్లైన్ షాపింగ్ యాప్ల ద్వారా ఆఫర్లు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. – తుహిన్ సిన్హా, ఎస్పీడిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు..నర్సీపటా్ననికి చెందిన ఒక వృద్ధుడు సైబర్ మోసానికి గురయ్యారు. ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాలో అనాథరైజ్డ్గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయిందని, తక్షణమే రిటర్న్ కొట్టకపోతే అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. తక్షణమే బ్యాంక్ ఖాతా వివరాలన్నీ చెప్పండి చెక్ చేస్తాం.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ బెదిరించారు. వారి మాటలకు భయపడి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.కోటి 43 లక్షల వరకు తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు. 94 కేసుల్లో రూ.93.74 లక్షలు ఫ్రీజ్జిల్లాలో జూలై 1 నుంచి నేటి వరకు 94 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ.93,78,304 మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. అలాగే రూ.15,45,234 మొత్తాన్ని 17 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లించారు.జిల్లాలో గత ఆరేళ్లుగాసైబర్ కేసుల వివరాలు» 2021లో 128» 2022లో 217» 2023లో 310» 2024 జూన్ వరకు 201 » 2024 జూన్ నుంచి నేటి వరకు 94 కేసులు -
టీడీపీ నేతల వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార మదంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఓ దళిత మహిళను అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువుపాళెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మను స్థానిక టీడీపీ నేతలు విక్రమ్రెడ్డి, మోహన్రెడ్డి, శ్రీనివాసులు దుర్భాషలాడడంతోపాటు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగక ఆమెపై పోలీసు కేసు పెట్టించారు. పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్సై ద్వారా కూడా మందలించారు. దీంతో ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. ‘ఏ తప్పు చేయని నన్ను తోటపల్లిగూడూరు వెలుగు సీసీ కోసం ఇబ్బంది పెడుతున్నారు. దొరువుపాళెం గ్రామానికి చెందిన సునీత అనే వీఓఏ.. మహిళల పొదుపు సొమ్ము సుమారు రూ.18 లక్షలు దుర్వినియోగం చేసింది. దీంతో ఆమెను తొలగించి, మా బంధువు దారా కోటేశ్వరమ్మను నియమించారు. అయితే కూటమి పార్టీకి చెందిన స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ఒత్తిడి తెచ్చి కోటేశ్వరమ్మను తొలగించారు. తిరిగి సునీతనే వీఓఏగా నియమించారు. ఈ అన్యాయాన్ని నేను పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై టీడీపీ నాయకులు కక్ష కట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నా చావుకు అధికార టీడీపీ నాయకులే కారణం’ అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో వివరిస్తూ నిద్ర మాత్రలు మింగారు. అనంతరం ఆమె కుప్పకూలిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఓటుకు నోట్లు కేసులో చంద్రబాబుకు మత్తయ్య షాక్
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ రాశాడు. చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోట్లు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో మత్తయ్య పేర్కొన్నాడు.ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మత్తయ్య లేఖ కీలకంగా మారింది. లేఖలోని అంశాలను పిటిషన్ రూపంలో కోర్టులో ఫైల్ చేయనున్న మత్తయ్య తరఫు న్యాయవాది. -
నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను..!
ప్రొద్దుటూరు క్రైం(కడప జిల్లా): వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి(Venugopal Reddy) కిరాయి హంతకుల చేతిలో హతమయ్యాడు. వేణుగోపాల్రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల ద్వారా అతన్ని చంపించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్రెడ్డి శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చాపాడు వద్దనున్న కుందు వంతెన వద్ద గుర్తించారు. అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంతో కలిసి రూరల్ పోలీసులు అతికష్టం మీద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికి తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్రెడ్డి బంధువు, మరో వ్యక్తి కలసి వేణుగోపాల్రెడ్డిని హతమార్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులను శుక్రవారం ప్రొద్దుటూరుకు పిలిపించారు. వారు తమ కారును వేణుగోపాల్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు. అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలో ఉన్న ఆర్చీ దాటగానే కారులో ఉన్న కిరాయి హంతకులు అతన్ని ఆపినట్లు తెలిసింది. ఎవరు మీరు అని అడిగే లోపే వారు వేణుగోపాల్రెడ్డిని కొట్టడంతో కింద పడిపోయాడని, ఈ క్రమంలోనే దుండగులు కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని బతిమాలుకున్నా దుండగులు కనికరించలేదని తెలిసింది. వేణుగోపాల్రెడ్డి స్కూటీలో అక్కడికి రావడం, వారు హత్య చేయడం ఇదంతా రెండు, మూడు నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ వ్యాపారి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న దుండగులు మృతదేహాన్ని అదే కారులో వేసుకొని దువ్వూరు దారిలోని కామనూరు బ్రిడ్జి వద్ద కుందు నదిలో పడేసి అదే రాత్రికి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. తర్వాత నిందితులు హైదరాబాద్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కుందు నదిలో ఉన్న వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు.నిందితుల్లో వేణుగోపాల్రెడ్డి భార్య తరపు బంధువు కూడా..వేణుగోపాల్రెడ్డిని హతమార్చిన వారిలో అతని భార్య సమీప బంధువు ఒకరు ఉన్నట్లు తెలిసింది. కాగా 2016లో నిందితుల్లోని ఒక వ్యక్తితో గొడవ జరిగింది. వేణుగోపాల్రెడ్డి డబ్బు అడగటానికి వెళ్లగా అతను దాడి చేశాడు. దీంతో వేణుగోపాల్రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండేళ్ల క్రితం వీరి మధ్య రాజీ కుదిరింది. కాగా నిందితుల్లోని ఇద్దరు వ్యక్తులకు వేణుగోపాల్రెడ్డి రూ. లక్షల్లో బాకీ ఇచ్చాడు. ఈ డబ్బు గడువు ముగిసినా వారు ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. అంతేగాక కొంత కాలం తర్వాత వారి ఆస్తులు అటాచ్ కోరుతూ ఫైనాన్షియర్ మరో మారు కోర్టును ఆశ్రయించాడు. ఇది ఇరువురు బాకీ దారులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు వేణుగోపాల్రెడ్డికి నచ్చచెప్పినట్లు తెలిసింది. అయినా కూడా అతను ఆస్తుల అటాచ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ కారణంతోనే ఇద్దరు కలిసి హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హతమార్చినట్లు సమాచారం. కాగా కేసులోని ప్రధాన నిందితులు, కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పరార్.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
సాక్షి, తూర్పుగోదావరి/ఎన్టీఆర్ జిల్లా: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుండగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ సోమవారం రాత్రి 7.30గంటలకు దేవరపల్లి మండల దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దొంగతనం కేసులో నిందితుడు అయిన ఇతను పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని దేవరపల్లి ఇన్స్పెక్టర్ తెలిపారు.పైముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 94407 96584 (ఇన్స్పెక్టర్ దేవరపల్లి), 94407 96624 (సబ్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి) ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు. బత్తుల ప్రభాకర్ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలే టార్గెట్గా చోరీలకు పాల్పడిన నిందితుడి ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి.గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్లో పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. -
భార్య చికెన్ వండలేదని యువకుడి ఆత్మహత్య
యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్లలక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి కిడ్నాప్ కలకలం!
తాడేపల్లి రూరల్: అప్పటిదాక జ్యూస్ షాప్ నడిపి... భార్యతో కారులో ఇంటికి వెళ్తున్న యువకుడిని ఐదుగురు వ్యక్తులు అడ్డుకుని తీసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి స్టేషన్ పరిధి ప్రాతూరు రోడ్డులో జరిగింది. యువకుడి భార్య లక్ష్మీప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డులో కె.స్రవంత్రెడ్డి జ్యూస్ షాప్ నడుపుతున్నాడు. సోమవారం సాయంత్రం స్నేహితుడి కారులో ప్రాతూరులోని ఇంటికి వెళ్తుండగా కుంచనపల్లి దాటాక ఓ కారు వచ్చి అడ్డగించింది. తొలుత ఇద్దరు, తర్వాత ముగ్గురు కిందకు దిగారు.తాము పోలీసులమని, యాక్సిడెంట్ కేసులో నీ భర్తను విచారించడానికి తాడేపల్లి తీసుకెళ్తున్నామని చెప్పారు. కానీ, ప్రాతూరు వైపు వెళ్తుండడంతో లక్ష్మీప్రసన్న అనుమానించింది. తమ కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను సమాధానం చెప్పలేదు. వాహనాన్ని తిప్పుకొని తాడేపల్లి బైపాస్ వైపు వెళ్లాడు. స్రవంత్రెడ్డిని ఒకవైపు, తాము ప్రయాణిస్తున్న కారును తాడేపల్లి వైపు తీసుకువెళ్లారు. రూటు మార్చడంతో... 100కు డయల్ చేసినా స్పందన రాలేదని, సంఘటనపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని లక్ష్మీప్రసన్న తెలిపింది. కాగా, ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్ఐ ప్రతాప్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. స్రవంత్రెడ్డిని తీసుకెళ్లింది పోలీసులే అయి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్రవంత్కు ఎవరితోనూ గొడవల్లేవని, కేసులు లేవని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారని బంధువులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్.. ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్ పెట్టుకుని పిడికిళ్లు బిగించుకుని సోమవారం గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా శ్రీరామవరం ప్రాంతానికి చెందిన కమ్మ రాజు రైతు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె శ్రావ్య (20) గుంటూరు అశోక్నగర్లోని నవీన్ లేడీస్ హాస్టల్లో ఉంటూ వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం బీటెక్ చదువుతోంది.చదువులో చురుగ్గా ఉంటూ 85 శాతం మార్కులు సాధిస్తోంది. అయితే, ఆదివారం సాయంత్రం శ్రావ్య తన చిన్ననాటి స్నేహితురాలైన జాగృతికి ఫోన్చేసి తనకు చాలా చికాకుగా ఉందని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ కన్నీరుమున్నీరైంది. దీంతో స్నేహితురాలు ధైర్యం చెప్పింది. అయినా అనుమానంతో జాగృతి.. శ్రావ్య సోదరుడికి ఫోన్చేసి జరిగిన విషయం వివరించింది. అతను తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే ఏలూరు వచ్చేయాల్సిందిగా కుమార్తెకు చెప్పింది. అయితే, గురువారం నుంచి సెలవులు కాబట్టి అప్పుడు వస్తానని తన తల్లితో శ్రావ్య చెప్పింది. ఆన్లైన్లో ప్లాస్టర్, ఐరన్ క్లిప్ ఆర్డర్.. కానీ, శ్రావ్య ఆదివారం రాత్రే ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాస్టర్ను, ఐరన్ క్లిప్ను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డెలివరి వచ్చింది. హాస్టల్లోని తోటి స్నేహితులు ఆరుబయట మెట్లపై ఎందుకు కూర్చున్నావని శ్రావ్యను అడగటంతో ఆమె దురుసుగా మాట్లాడింది. దీంతో వారంతా లోపలకు వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికి నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్ను పెట్టుకుని రెండు పిడికిళ్లు గట్టిగా బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున తోటి విద్యార్థినులు గదిలో నుంచి బయటకొచ్చి చూసి భయంతో హాస్టల్ వార్డెన్కు సమాచారమిచ్చారు.సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హాస్టల్లో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. తోటి విద్యార్థినులతో వారు మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. శ్రావ్య కుటుంబ సభ్యులు హాస్టల్కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు శ్రావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిండ ప్రదానానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
మార్టూరు: మహళయ పక్షాల్లో చివరిరోజు అయిన ఆదివారం అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటకాలతో పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయన్న నమ్మకంతో ఆలయానికి బయల్దేరిన కుటుంబంలోని ముగ్గురు మార్గంమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కోలలపూడి సమీపంలో జరిగింది. వేగంగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా అడ్డొచి్చన కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సిమెంట్ దిమ్మెలను, డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలివీ.. తిరుపతి పట్టణంలో రేడియేటర్ మెకానిక్ అయిన దామర్ల లక్ష్మణ్ (70), అతని భార్య సుబ్బాయమ్మ (65), కుమారుడు గణేష్ బాబు, అతని భార్య పద్మజ, వారి కుమారుడు హేమంత్ (25)లతో కలిసి కారులో పిఠాపురం ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు బయల్దేరారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రహదారి పక్కన సిమెంట్ దిమ్మెలను ఢీకొని పల్టీ కొట్టుకుంటూ మార్జిన్లోకి దూసుకెళ్లింది. ప్రమాద ధాటికి డ్రైవింగ్ సీట్లో ఉన్న హేమంత్, తాతయ్య లక్ష్మణ్, నానమ్మ సుబ్బాయమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన గణేష్బాబు, అతని భార్య పద్మజను పోలీసులు మార్టూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ముగ్గురి మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో పంచనామా చేయించి బంధువులకు అప్పగించారు. గణేష్ బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వలపు వల.. వంచించెనిలా!
కర్నూలు: సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన భార్య, భర్త, ఓ ప్రేమికురాలు ముఠాగా ఏర్పడి మత్తెక్కించే మాటలతో యువకులను ఆకట్టుకొని, ఆ తర్వాత బెదిరించి డబ్బు గుంజుతున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి బలరాం నగర్కు చెందిన చిక్కిరి మల్లేష్, భార్య పెరుమాళ్ల మేరీ, మల్లేష్ ప్రేమికురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ ముఠాగా ఏర్పడి డబ్బున్న వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తుంటారు. వారికి ఫోన్ చేసి తీయనైన మాటలతో ముగ్గులోకి దింపి నగ్న వీడియోలు పంపి బెదిరించి డబ్బులు దండుకునేవారు. కర్నూలుకు చెందిన వ్యాపారి ప్రదీప్ ఈ ముఠా సభ్యుల మాటలను నమ్మి దాదాపు రూ.3.80 కోట్ల నగదు వారి ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికత సాయంతో వారు వినియోగించిన కాల్ డేటా ఆధారంగా రెండో పట్టణ పోలీసులు ముఠా సభ్యుల గుట్టు రట్టు చేసి కటకటాలకు పంపారు.తక్కువ ధరకే పొలం ఇస్తామంటూ మోసం.. ముగ్గురు ముఠా సభ్యులు కలసి సంయుక్త రెడ్డి పేరుతో ట్విటర్ ఖాతా ద్వారా నగ్నంగా వీడియో కాల్స్ చేసి మత్తెక్కించే మాటలతో నమ్మించి మోసానికి పాల్పడ్డారు. విజయవాడకు సమీపంలో తమకు ఖరీదైన పొలం ఉందని, డబ్బులు అవసరమున్నందున తక్కువ ధరకే ఇస్తామంటూ రూ.3.80 కోట్లు వసూలు చేశారు. రూ.41.26 లక్షలకు రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బు రూ.3.38 కోట్ల నగదును ముగ్గురూ పంచుకుని జల్సా చేశారు.ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముఠా సభ్యులను అరెస్టు చేసి విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. వారి నుంచి 2 కార్లు, మోటర్ సైకిల్, ల్యాప్టాప్, 3 సెల్ఫోన్లు, 5 తులాల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు పేర్కొన్నారు.