పెద్దముడియం డీటీ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పెద్దముడియం డీటీ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి

Apr 24 2025 12:42 AM | Updated on Apr 24 2025 12:42 AM

పెద్దముడియం డీటీ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి

పెద్దముడియం డీటీ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ఒకరి భూమి మరొకరి పేరిట మార్చడం ద్వారా అక్రమాలకు పాల్పడిన పెద్దముడియం డిప్యూటీ తహసీల్దార్‌ గౌసియాబేగం, ఆర్‌ఐ భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ను కోరారు. వీరిరువురూ దీర్ఘకాలంగా పెద్దముడియంలో పనిచేస్తూ అనేక అవకతకవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ మండలంలోని కొండపాపయ్యపల్లెకు చెందిన పి.గౌరీదేవికి దిగువ కల్వటాల గ్రామంలో వారసత్వంగా వచ్చిన 40 ఎకరాల భూమిని ఇతరుల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించి ఆన్‌లైన్‌ చేశారని ఆరోపించారు. సర్వే నెంబర్లకు శ్రీపిశ్రీ అనే అక్షరాన్ని చేర్చి సర్వే నెంబరు 691/1పీలో గిరిధర్‌రెడ్డి, సుబ్బయ్య అనే వ్యక్తుల పేర్లతో, అలాగే సర్వే నెంబర్లు 722, 692/1లోని భూమిని మునగల భాస్కర్‌రెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి పేర్లతో సర్వేనెంబరు 691/3లోని భూమి పుణ్యావతమ్మ పేర్లతో ఆన్‌లైన్‌ చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై పలుమార్లు బాధితురాలు గౌరీదేవి విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదన్నారు. విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, బాధితురాలు గౌరీదేవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement