వాగును నమ్ముకుని నాలుగు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుని మిరప, పత్తి పంటలను సాగు చేస్తున్నాను. సరైన వర్షం పడకపోవడంతో ఈ సంవత్సరం వాగులో ఒక్కసారి కూడా నీళ్లు పారలేదు. వాటర్ ప్లాంట్ను శుభ్రం చేయగా వచ్చే వృథానీరు పదిహేను రోజులకు ఒకసారి వస్తాయి. ఈ నీటితోనే ఇన్ని రోజులు నెట్టుకొస్తున్నాము. వాగు వెంట మోటార్లు ఎక్కువ సంఖ్యలో వేయటంతో వాగు ఎగువ భాగంలో ఉన్న రైతులకే ఆ నీళ్లు సరిపోతలేవు. వర్షాలు లేక పత్తి చేలు, తోటలు వాడుపడుతున్నాయి.
– కత్తి ప్రభాకర్రెడ్డి, రైతు, బట్టుగూడెం


