అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం | North Carolina Shooting Three Killed in Southport Restaurant | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం

Sep 28 2025 10:58 AM | Updated on Sep 28 2025 12:12 PM

North Carolina Shooting Three Killed in Southport Restaurant

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.   ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట  వైరల్‌గా మారాయి.

విల్మింగ్టన్‌కు సమీపంలోని సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్‌లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ  దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన  వ్యక్తి ఒక్కసారిగా  తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి  వివరాలను అధికారులు ఇంకా  విడుదల చేయలేదు. 

స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్‌పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్‌పోర్ట్ పోలీస డిపార్ట్‌మెంట్‌కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం  చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement