శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరీ దేవిని సుమారు 50 వేల గాజులతో అలంకరించారు. ముందుగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, లలిత సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన పుప్పాల మల్లేశ్వరరావు, నాగమణి దంపతులు, భక్తుల సహకారంతో పూజ కార్యక్రమాలను చేసి, 30 వేల గాజులతో మూల విరాట్ అమ్మవారి విగ్రహానికి, 20 వేల గాజులతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరణ చేశారు.
– భీమవరం (ప్రకాశంచౌక్)


