రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా వీలైనంత నీరు విడుదల చేసేందుకు ప్రయత్నించాలన్నారు. నీటి విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో నాగర్కర్నూల్, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, విజయుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్బాషా, హేమంత కేశవ్ పాటిల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


