గాంధీకి గుడి కట్టిన దేశభక్తులు | - | Sakshi
Sakshi News home page

గాంధీకి గుడి కట్టిన దేశభక్తులు

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

రాజాం: రాజాం పట్టణంలో స్వాతంత్య్ర సాధనకు చిహ్నంగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి శెగిడి వీధిలో గుడి కట్టారు. ఆ వీధికి గాంధీ వీధిగా నామకరణం చేశారు. 1996లో దాత దొంతంశెట్టి రమణ సాయంతో పైడిరాజు, డి.మలయ్య గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటా స్వాతంత్య్రవేడుకలతో పాటు గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. జాతీయోధ్యమ స్ఫూర్తిని వీధివాసులకు వివరిస్తారు.

రాజాం సిటీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాం పట్టణ పరిధి కస్సావీధికి చెందిన సూక్ష్మ చిత్రకళాకారుడు ముగడ జగదీష్‌ రూపొందించిన సూక్ష్మ వెండి భారతదేశం పలువురిని ఆకట్టుకుంది. 2.200 మిల్లీ గ్రాముల వెండితో 3 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీ మీటర్ల వెడల్పుతో భారతదేశ చిత్రపటం, అందులో జాతీయ జెండాను రూపొందించారు. దీనిని తయారుచేయడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు.

గాంధీ గుడి

ఆకట్టుకున్న వెండి భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement