డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో నిరసన సభ, ర్యాలీ నిర్వహించారు. దేవీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ నారాయణమూర్తి నేతృత్వంలోని పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేపట్టే ర్యాలీని అడ్డుకునేలా సర్కారు పెట్టిన ఆంక్షలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకురాలు కె.భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


