● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి
● చిట్టచివరన విజయనగరం
విజయనగరం అర్బన్:
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగం పెంచాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ‘సర్’ పురోగతిపై అధికారులు, బీఎల్ఓలకు శుక్రవారం పలు సూచనలిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,847 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో 15,78,949 మంది ఓటర్లకు 12,50,069 మంది ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేశారన్నారు. జిల్లాలో 79.17 శాతం పురోగతి నమోదైనట్టు వెల్లడించారు. 81.70 శాతంతో గజపతినగరం నియోజకవర్గం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవగా, 75.79 శాతంతో విజయనగరం నియోజకవర్గం చివరి స్థానంలో ఉంది.


